Tuesday, May 14, 2024

తెలంగాణ అమరవీరులకు ఢిల్లీ టీయూడబ్ల్యుజే నివాళులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు టీయూడబ్ల్యుజే(తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ఢిల్లీ కమిటీ నివాళులర్పించింది. గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న అవతరణ దినోత్సవాల్లో భాగంగా టీయూడబ్ల్యుజే ఢిల్లీ అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి, తెలంగాణా తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారంతా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జర్నలిస్టులందరూ తమ వంతు సేవలందిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే ఢిల్లీ ఉపాధ్యక్షురాలు స్వరూప పొట్లపల్లి, కోశాధికారి శిరీష్‌రెడ్డి, సెక్రటరీ జబ్బార్ నాయక్, సభ్యులు మహాత్మ, ఆచార్య శరత్ చంద్ర, ప్రభు, గణేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement