Friday, May 17, 2024

రాష్ట్ర సాధ‌న‌లో అమ‌రులైన వీరులకు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా.. డిప్యూటీ మేయ‌ర్

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని హైదరాబాద్ న‌గ‌ర‌ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర, జిల్లా, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… వారి ప్రాణత్యాగానికి విలువనిస్తూ… పట్టువదలని విక్రమార్కుడిలా, తన ప్రాణాలను సైతం ఫ‌ణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకై అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించి స్వరాష్ట్రం సాధించిపెట్టి, అన్నిరంగాల్లో వెనక్కి నెట్టబడిన తెలంగాణను ఈ ఎనిమిది ఏళ్లలో యావత్ ప్రపంచం మన వైపు చూసేలా అభివృద్ధి చేస్తూ, బంగారు తెలంగాణగా మలుస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు ఈ సందర్భంగా మనఅందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. తార్నాక డివిజన్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో క‌లిసి పాల్గొన్నారు. తార్నాక చౌరస్తాలో జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో మువ్వన్నెల జండావందనం చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తార్నాక కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాసా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement