Thursday, May 2, 2024

స్కూటీ ఢీకొని వృద్ధుని మృతి

కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం ముందు స్కూటీ ఢీకొని వృద్ధుడు చనిపోయారు. దేవుని పల్లి గ్రామానికి చెందిన పోచమ్మల దుర్గయ్య తండ్రి కోటయ్య 75 అల్లూరి సీతారామ రాజు విగ్రహం ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గణేష్ 19 అనే యువకుడు స్కూటీ నడిపిస్తూ వృద్ధుడిని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన వృద్ధుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని దేవునిపల్లి పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో వృద్ధిని బంధువులు తమ వ్యక్తి చనిపోయినందుకు కారణమైన యువకున్ని కఠినంగా శిక్షించాలని ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేసి ధర్నా చేపట్టారు. నిందితున్ని తామే శిక్షిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవునిపల్లి పోలీసులు బాధితులను శాంత‌పరిచి, చట్టపర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement