Wednesday, May 22, 2024

Delhi | రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నేత కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. లక్ష పోస్టు కార్డులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాయించారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన పోస్టు కార్డ్ ఉద్యమానికి పిలుపునిచ్చారు.

వివిధ వర్గాల నుంచి సేకరించిన ఆ పోస్టుకార్డులను అప్పలనాయుడు స్వయంగా సేకరించి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు అందజేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ నినాదాలతో పాటు చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ అందులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement