Saturday, April 27, 2024

కేసులు తగ్గుతున్నా మరణాలు తగ్గట్లే @ఇండియాలో కరోనా అప్డేట్

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా…మ‌ర‌ణాల సంఖ్య మాత్రం అసలు తగ్గట్లేదు. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు 3403మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో క‌రోనా నుండి 1,34,580మంది కొలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు సంఖ్య 2,92,74,823కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,77,90,073కి చేరింది. మరోవైపు 3,63,079మంది దేశ వ్యాప్తంగా మృతి చెందారు.ఇక ప్రస్తుతం డేదంలో 11,21,671 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement