Saturday, April 27, 2024

ఏపీలో కరోనా తగ్గుముఖం….కొత్తగా 5741 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 96,153 సాంపిల్స్ ని పరీక్షించగా 5,741 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప
లో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,567 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

ఏపీలో ప్రస్తుతం 75,134యాక్టివ్ కేసులుండ‌గా, 12,052 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రవ్యాప్తంగా 18,20,134మందికి క‌రోనా చేర‌గా, కోలుకున్న వారి సంఖ్య 17,32,948కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement