Tuesday, April 23, 2024

100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

నల్గొండ జిల్లా నకిరేక‌ల్‌లో 100 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు. సూర్యాపేట‌లో క‌ర్న‌ల్ సంతోష్‌బాబు విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రులు కేటీఆర్‌, జ‌గ‌దీష్‌రెడ్డి స్థానికంగా చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు అదేవిధంగా సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

అనంత‌రం అక్క‌డి నుండి బ‌య‌ల్దేరి న‌ల్ల‌గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక, పాఠశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీ‌ష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement