Saturday, April 27, 2024

తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులు…ఎక్కువగా గ్రేటర్ లోనే !!

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గతరాత్రి గడిచిన 24 గంటల్లో కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,791కు చేరింది. ఇక కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,680కు చేరింది. మరోవైపు కరోనా నుంచి 157 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,684 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 82 వేలు దాటిన కరోనా కేసులు దాటాయి. గడిచిన 24 గంటల్లో మరో 138 కరోనా కేసులు గ్రేటర్ పరిధిలో నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 82,039 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement