Thursday, May 16, 2024

విద్యుత్ షాక్ తో కానిస్టేబుల్ మృతి

విద్యుత్ షాక్ తో ఓ కానిస్టేబుల్ మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట మండ‌లం కానాయ‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భాజ శ్రీనివాసులు (38) అనే కానిస్టేబుల్ ఈ ఉద‌యం త‌న వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ షాక్‌కు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. శ్రీనివాసులు వ‌న‌ప‌ర్తి ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వ‌హిస్తున్నాడు. కానిస్టేబుల్ మృతిప‌ట్ల వ‌న‌ప‌ర్తి జిల్లా పోలీసులు సంతాపం ప్ర‌క‌టించారు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు కుమారులున్నారు. శ్రీనివాసులు నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement