Tuesday, May 21, 2024

స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన – శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్ష‌

శ్రీలంక్ష‌లో సంక్షోభం నేప‌థ్యంలో ఆ దేశాన్ని విడిచి పారిపోయారు ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్ష‌.కాగా ఆయ‌న మ‌ళ్లీ స్వ‌దేశానికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు మంత్రులు, రాజ‌కీయ‌వేత్త‌లు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద స్వాగ‌తం ప‌లికిన‌ట్లు తెలుస్తోంది. విమానం నుంచి గోట‌బ‌య దిగ‌గానే రాజ‌కీయ‌వేత్త‌లు పూల‌మాల‌ల‌తో ప‌రుగెత్తుకు వ‌చ్చిన‌ట్లు ఓ ఎయిర్‌పోర్ట్ అధికారి తెలిపారు. జూలై నెల‌లో మిలిట‌రీ స‌హాయంతో రాజ‌ప‌క్ష దేశాన్ని విడిచి వెళ్లారు. ఆర్థిక సంక్షోభాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో అధ్య‌క్ష భ‌వ‌నాన్ని చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. తొలుత సింగ‌పూర్, ఆ త‌ర్వాత థాయిలాండ్ వెళ్లిన గోట‌బ‌య త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోట‌బ‌య బ్యాంగ్‌కాక్ నుంచి సింగ‌పూర్ మీదుగా లంక చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న ఓ థాయిలాండ్ హోట‌ల్‌లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement