Saturday, April 27, 2024

Police action | కేజ్రివాల్ అరెస్ట్‌పై ఆందోళనలు.. ఆప్ కార్యాలయానికి తాళం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలోని పలు ప్రాంతాల‌తో పాటు, ఆప్ ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు. అయితే ఆప్ కార్యాలయానికి సమీపంలోనే బీజేపీ కార్యాలయం కూడా ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తలు నిరసనలు చేస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీల కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆందోళనలను విరమించారు.

ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసివేశారు. కార్యాలయానికి వైపు ఎవరూ వెళ్లకుండా భారీకేట్లను ఏర్పాటు చేశారు. దీనిపై ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకే ఆప్ కార్యాలయాన్ని మూసివేశారని మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మా పార్టీ కార్యాలయాన్ని ఎలా మూసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆప్ మంత్రులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement