తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవ్వాల (సోమవారం) కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. ఉదయం 10.40 నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి 11.20 కి కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ మైదానానికి చేరుకుంటారు. అక్కడినుండి మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య దశదినకర్మ కార్యక్రమానికి హజరవుతారు. దీనికి కొండా సత్యలక్ష్మి గార్డెన్స్ కు వెళ్లి చిత్రపటం వద్ద నివాళులర్పించనున్నారు.
ఇక.. 12.10 నిమిషాలకు కరీంనగర్ నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.