Saturday, May 4, 2024

నిరుపేద‌ల‌కు అండ‌గా సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజ‌న్ రెడ్డి

వనపర్తి/పెద్దమందడి, ఏప్రిల్ 14 (ప్రభ న్యూస్); నిరుపేదల వైద్యానికి ఖర్చులు భరిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అండ‌గా నిలిచారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 159 మంది లబ్ధిదారులకు రూ.54.48 లక్షల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు భోజన ఏర్పాట్లు చేయగా వారితో పాటు సహపంక్తి భోజనం చేసి మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement