Saturday, April 27, 2024

బాలీవుడ్ లో మ‌ల్లేశం డైరెక్ట‌ర్.. మూవీ పోస్ట‌ర్ రిలీజ్

బాలీవుడ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజ్ రాచ‌కొండ‌. చాలా గ్యాప్ తర్వాత హిందీలో ఇట్స్ 8 ఏఎమ్ మెట్రో అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలని ఎంచుకొని సినిమాలు చేస్తోన్న రాజ్ రాచకొండ ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయోగమే చేశారు.ముంబై మెట్రో ట్రైన్ లో ప్రయాణించి ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారింది అనే పాయింట్ తో ఈ మూవీని ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా ఆవిష్కరించారు. సయామీఖేర్ గుల్షన్ దేవయ్య ఈ మూవీలో లీడ్ పెయిర్ గా చేస్తున్నారు.

ఈ మూవీకి ప్రముఖ లెరిక్ రైటర్ పొయిట్ గుల్జార్ ప్రత్యేకంగా 6 పద్యాలని రాయడం విశేషం. హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ సన్నివేశాలని ఎలివేట్ చేసే విధంగా ఈ పద్య గీతాలు ఉంటాయని తెలుస్తోంది. మరి మల్లేశం మూవీతో అందరి దృష్టిని ఆకర్షించి రాజ్ రాచకొండ ఈ సినిమాతో హిందీలో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి. తెలుగులో మల్లేశం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయ‌న‌. తెలంగాణ మల్లేశం అనే చేనేత కార్మికుడి నిజజీవిత కథని తెరపై అంతే నేచురల్ గా ఆవిష్కరించి ఈ దర్శకుడు హిట్ కొట్టాడు. న‌టుడు ప్రియదర్శికి ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. పలు అవార్డులని సైతం ఆ మూవీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మల్లేశం మూవీకి రాజ్ రాచకొండ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ మూవీ తర్వాత మలయాళంలో పక్కా అనే థ్రిల్లర్ మూవీని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement