Saturday, May 4, 2024

విద్యుద్ఘాతంతో.. ఒకే ఫ్యామిలీలోని నలుగురు దుర్మ‌ర‌ణం..

విద్యుద్ఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి శ్రీకారం చుట్టింది. అయితే గృహ ప్రవేశ సమయంలో విద్యుద్ఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన ల‌క్ష్మ‌మ్మ (70), ప్ర‌శాంత్ (25), ల‌క్ష్మ‌న్న (53)లుగా గుర్తించారు. అయితే ఈ ముగ్గురితో పాటు చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందినట్లు సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement