Monday, May 13, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సివిల్స్ ర్యాంక‌ర్ అఖిల్

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించిన అఖిల్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. సివిల్స్ – 2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ గౌడ్
సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్ కు ముందుగా అభినందనలు తెలిపారు. పేదరికం, అపజయాలు లెక్క చేయకుండా నిరంతర కృషితో లక్ష్యాన్ని చేరుకోవడం హర్షణీయ‌మ‌న్నారు. మీ విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement