Friday, April 26, 2024

సిస్ట‌ర్స్..ఫ్రెండ్స్ తో క‌లిసి ఊటీ ట్రిప్ కి వెళ్లిన రామ్ చ‌ర‌ణ్-ఫొటో పోస్ట్ చేసిన చిరంజీవి

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో RC 15 మూవీలో నటిస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ దొరకడంతో ఊటీ అందాలు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కా.. చెల్లెలు, ఫ్రెండ్స్‌తో కలిసి చిన్నపాటి ట్రిప్‌కు వెళ్లిపోయాడు. గత వారం ఫ్లైట్‌లో వెళుతున్న పిక్‌ను చెర్రీ సోషల్ మీడియాలో పంచుకోగా.. ఎక్కడికి వెళుతున్నారో చెప్పలేదు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్‌ను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘తమ పిల్లలందరూ ఒక దగ్గర ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్‌తో పాటు శ్రీజ, సుస్మిత ఈ ఫొటోలో ఉన్నారు. ఊటీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement