Saturday, May 4, 2024

Chess King – చెస్ సంచ‌ల‌నం ప్ర‌జ్నానంద్ కు మోడీ ఆత్మీయ విందు …

గతవారం చెస్‌ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీఅభినందించారు. ప్రజ్ఞా, అతని తల్లిదండ్రులను ప్రధాని ఆయన నివాసానికి పిలుపించుకున్నారు. చెస్ మేధావిని అభినందించిన ప్రధాని అతని తల్లిదండ్రులతో అప్యాయంగా మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన మోడీతన ఇంటికి విశిష్ఠ అతిథులు వచ్చారని ట్వీట్ చేశారు. ‘ప్రజ్ఞానందను అతని కుటుంబంతో సహా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదల, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద. నిన్ను చూసి గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement