Saturday, May 18, 2024

వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బ్రైన్ స్ర్టోక్.. కిమ్స్ కు త‌ర‌లింపు

కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బ్రైన్ స్ర్టోక్ కు గురయ్యారు. దీంతో ఆయ‌న‌ను మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. కాగా బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయినట్టు, మెదడులో రక్తం గడ్డకట్టినట్టు స్కానింగ్ లో తేలింది. దీంతో నేటి ఉద‌యం ఆయ‌న‌ను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement