Monday, April 29, 2024

ADB: ఆరోగ్య కేంద్రానికి రూ.1.43 కోట్ల నిధులు మంజూరు: విప్ బాల్క సుమన్

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.43 కోట్ల నిధులతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులకు నియోజకవర్గ ప్రజల తరపున ఈ సందర్భంగా విప్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement