Monday, May 6, 2024

Polling : ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో పోలింగ్ ప్రారంభం

ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగుతోంది.

బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. అంతగఢ్, భానుప్రతాపూర్, కంకేర్, కేస్‌కల్, కోండగావ్, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో మధ్యాహ్నం మూడు వరకే పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement