Wednesday, May 1, 2024

Modi: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ…. బహిరంగ సభ

ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్‌కు రానున్నారు. హైదాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో జ‌రిగే స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ సాయంత్రం 5.05గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ నుంచి సభ జరిగే ఎల్బీ స్టేడియానికి చేరుకుని సాయంత్రం 5.30 గంటల నుంచి సాయంత్రం 6.10 గంటల వరకు ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6.15 గంటలకు తిరిగి బేగంపేట్‌కు వెళ్లి, అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement