Thursday, May 2, 2024

Praja Ashirvada sabha : ఇవాళ ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు సీఎం కేసీఆర్

ఇవాళ ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. మంద‌మ‌ర్రి, పెద్ద‌ప‌ల్లి, మంథ‌ని నిర్వ‌హించే స‌భ‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని సీఎం కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సభా ప్రాంగణాల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిలువెత్తు కటౌట్లు పెట్టారు.

చుట్టుపక్కల, వచ్చే దారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికలను గులాబీ తోరణాలతో అలంకరించారు. సభాస్థలాల్లో నీడ కోసం షామీయానాలు వేశారు. వచ్చిన వారు కూర్చునేలా కుర్చీలను సిద్ధం చేశారు. తాగునీటి వసతి కల్పించారు. అత్యపరిస్థితులు ఎదురైతే అవసరం మేరకు అంబులెన్స్‌లో అందుబాటులో ఉంచారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు సభలో పాల్గొననున్న నేపథ్యంలో సభ స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement