Saturday, April 27, 2024

HYD: రాడిసన్ బ్లూ పబ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు

హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ పబ్ కేసులో ఛార్జి షీట్ దాఖలైంది. పబ్ యజమానితో పాటు ఆరుగురు వ్యాపారవేత్తలపై అభియోగాలున్నాయి. అభిషేక్ ఉప్పల, కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేనిలపై అభియోగాలున్నాయి. పబ్ లో ఆరుగురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ తీసుకున్నట్లు, డ్రగ్ కింగ్ టోనీనే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్ లలో యజమానులకు తెలిసే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు అభియోగముందని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement