Friday, April 26, 2024

రేప‌టి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌..

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 28వ తేదిన కందుకూరు, 29న కావలి, 30న కోవూరులలో ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజులుగా ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పలువర్గాల ప్రజలతో ప్రత్యేక సమావేశాల్లోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు రకరకాల ఆంక్షాలు పెడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మండిపడ్డారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ చూడ‌లేమ‌న్నారు. కందుకూరు, కావలిలో జరిగే చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బాబు పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని ఎస్సీ నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement