Tuesday, April 30, 2024

తెనాలిలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే పట్టణంలో 24 కేసులు నమోదయ్యాయి. మారిస్ పేటలోని జీవనజ్యోతి నర్సింగ్ కళాశాలలో 11 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులంతా ఇక్కడ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ కోర్సు చేస్తున్నారు.

అటు మంగళవారం ఒక్కరోజే గుంటూరు జిల్లాలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసులు 75,973కి చేరాయి. ఇందులో యాక్టివ్‌గా 154 కరోనా కేసులు ఉన్నాయి. జిల్లాలో కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 672 మంది మృత్యువాత పడ్డారు. కరోనాతో పోరాడి 75,147 మంది జిల్లా వ్యాప్తంగా డిశ్చార్జ్ అయ్యారు. కేసులు పెరుగుతున్న వేళా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement