Sunday, May 19, 2024

అవిశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అవిశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ‘పార్టీ గేట్’ కుంభకోణం నేపథ్యంలో సొంత పార్టీ సభ్యులే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 148 ఓట్లు వచ్చాయి. ఫలితంగా 59 శాతం మంది చట్ట సభ్యుల విశ్వాసాన్ని ఆయన చూరగొన్నారు.

అవిశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన అనంత‌రం బోరిస్ జాన్స‌న్ మాట్లాడుతూ.. 59 శాతం మంది స‌భ్యులు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ విజ‌యం త‌న‌కు శుభ ప‌రిణామం అని పేర్కొన్నారు. ఇది చాలా సానుకూల, నిర్ణ‌యాత్మ‌క‌మైన ఫ‌లితం అని తాను భావిస్తున్న‌ట్లు జాన్స‌న్ తెలిపారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తామ‌న్నారు.

2019 ఎన్నికల్లో విజయం సాధించిన బోరిస్.. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం, తన నివాసంలో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఇటీవల ఆయన పార్లమెంటులో క్షమాపణలు కూడా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement