Saturday, May 4, 2024

భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. తొలుత ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్ కరోనా కారణంగా రాలేకపోయారు. అయితే భారత ప్రధాని మోదీతో భేటీ కోసం ఆయన ఈ నెల చివరి వారంలో భారత్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కరోనా మళ్లీ తీవ్రం కావడంతో పర్యటనను కుదించుకున్నారు. కానీ కరోనా ఏమాత్రం శాంతించకపోవడంతో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది.

ఈ నేపథ్యంలో వర్చువల్ విధానంలో భారత్, బ్రిటన్ పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు భారత ప్రధాని మోదీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement