Wednesday, April 24, 2024

హీరోయిన్ తో కూడా స్టంట్స్ చేయిస్తున్న ప్రశాంత్ నీల్ ?

కే జి ఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రశాంత్ సినిమాలో హీరోయిన్ కు అంతగా ప్రాముఖ్యత ఉండదని మొత్తం యాక్షన్ సీన్స్ పైనే ఫోకస్ ఉంటుందని ముందు నుంచి ఒక టాక్ ఉంది. అయితే దాన్ని మార్చేస్తూ ప్రశాంత్ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కు ఓ కీలక పాత్ర ఇచ్చాడట.

ఈ సినిమాలో శృతి జర్నలిస్టు గా చేసే సాహసాలు మామూలుగా ఉండవట. ఇక ఇటీవల శృతి హాసన్ పై కీలక యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement