Tuesday, May 14, 2024

సందర్శకులను ఆకర్షించే విధంగా బొటానికల్‌ గార్డెన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బొటానికల్‌ గార్డెన్‌ను దేశ, విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్శించే విధంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను టీఎస్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ వే-ఫార్వర్డ్‌ అనే ఒక రోజు వర్క్‌ షాప్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌లో శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి హాజరై మాట్లాడారు.

ప్రతీ సంవత్సరం నాటు-తున్నటు-వంటి లక్షలాది మొక్కలు నూటికి నూరు శాతం బ్రతికి ఉండేలా చర్యలు తీసుకొని తద్వారా సంస్థ ఆదాయం పెంచేందుకు దోహదపడాలని అధికారులను, ఫీల్డ్‌ సిబ్బందిని సూచించారు. అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను నాటి కార్పొరేషన్‌ ఆదాయాన్ని పెంచాలని కోరారు.

- Advertisement -

ఈసందర్భంగా ప్లాంటేషన్‌ మేనేజర్లకు ల్యాప్‌ టాప్‌లను ఆయన అందజేశారు. డివిజన్‌ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను, కార్యాచరణను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయనకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌, ఎండీ డా.జి.చంద్రశేఖర్‌ రెడ్డి, డైరెక్టర్‌ ఎంజె.అక్బర్‌, జీఎం.రవీందర్‌ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్లోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement