Tuesday, May 21, 2024

Delhi | తెలంగాణకు జాతీయ జల పురస్కారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ జల పురస్కారం వరించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ తుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ తదితరులు పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు.

11 విభాగాలలో పూరస్కారాలు ప్రకటించగా ఉత్తమ నీటి విధానాలను అవలంభించడం, ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జగన్నాథపురం సర్పంచ్ గడ్డం భవానీ, పంచాయతీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం అవార్డు, ప్రశంసపత్రాన్ని అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement