Wednesday, May 8, 2024

టీడీపీ, వైసీపీకి సోము సవాల్

ఏపీలో అరాచకాలను తుదముట్టిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. బీజేపీ- జనసేన జైత్రయాత్ర మొదలుపెట్టనుందన్నారు. బీజేపీని చూసి వైసీపీ, టీడీపీ భయపడుతున్నాయి తెలిపారు. వైసీపీ, టీడీపీ ఒక్కటై బీజేపీపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతి అభివృద్ధిపై చర్చకు పార్టీలు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. 5లక్షల మెజార్టీ రావాలని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పంచే డబ్బు ఏ సిమెంట్‌ ఫ్యాక్టరీ నుంచి వస్తోందో అని ప్రశ్నించారు. జనం ఓట్లు వేస్తేనే కదా వైసీపీకి మెజార్టీ వస్తుందో లేదో తేలేదన్నారు. టీడీపీకి కార్యకర్తలను కాపాడుకోవడమే సరిపోతుందని, బీజేపీకి బలం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని చురకలంటించారు. రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement