Saturday, April 27, 2024

పుదుచ్చేరిలో లీడ్ లో బీజేపీ కూట‌మి..

పుదుచ్చేరిలో ఎన్డీఏ కూట‌మి ముందంజలో ఉంది. 30 స్థానాల‌కు అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగాయి. తాజా స‌మాచారం మేర‌కు.. 11 స్థానాల్లో బీజేపీ కూట‌మి లీడింగ్‌లో ఉన్న‌ది. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నిక‌లు జ‌రిగాయి. పుదుచ్చ‌రి, కైరాక‌ల్‌, మాహి, యానాం ప్రాంతాల్లో పోలింగ్ జ‌రిగింది. యూటీ మొత్తంలో 17వేల పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు పోల‌య్యాయి. కైరాక‌ల్‌లో అయిదు స్థానాల‌కు కౌంటింగ్ జ‌రుగుతోంది. పుదుచ్చ‌రిలో మొత్తం 82 శాతం పోలింగ్ జ‌రిగింది. 324 మంది అభ్య‌ర్థులు పోటీప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement