Saturday, May 4, 2024

ముంబైలోని అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు

ముంబైలోని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. అబితాబ్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాదు ముంబై నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అమితాబ్ ఇంటితో పాటు పలు రైల్వేస్టేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలీసుల సోదాలలో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. దీంతో వారు ఇది ఫేక్ కాల్ అని స్పష్టం చేశారు. కాగా ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బంగ్లా వద్ద బాంబులు పెట్టామని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఫోన్ కాల్ ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: మరోసారి భయపెడుతున్న లారెన్స్.. ‘దుర్గ’ ఫస్ట్ లుక్ రిలీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement