Thursday, April 25, 2024

జ‌గ‌న్ పాల‌న‌లో నేతన్న భరోసా లేదుః లోకేష్

రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌లో చేనేత సోద‌రుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ అన్నారు. ‘చేనేత సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మోసపు నేతలో వైఎస్ జ‌గ‌న్  చేయి తిరిగిన కళాకారుడు. గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి… రూ.24 వేలను చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారు. అది కూడా అందరికీ లేదు.. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయి. మజూరీ, రాయితీలు ఆగిపోయాయి. సొంతంగా మగ్గం ఏర్పాటుకు రూ.1.5 లక్షల సబ్సిడీ రుణం ఇమ్మని, ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు కరోనా సాయం ఇచ్చి ఆదుకొమ్మని ఈ ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు అడిగాను. కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం డిమాండ్లను జగన్ రెడ్డి పరిశీలించి నేతన్నను ఆదుకోవాలి. ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ అందించడంతో పాటు అదనంగా గతంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించాలి’ అని లోకేష్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండిః జగన్​ పాలనలో ఆ రెండూ ఎక్కువే : అయ్యన్న

Advertisement

తాజా వార్తలు

Advertisement