Saturday, April 27, 2024

శ్రీకాకుళం జిల్లాలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ బస్‌ చక్రాలు..

బ‌స్ ర‌న్నింగ్ లో ఉండ‌గా చ‌క్రాలు ఊడిపోయిన ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లా సోంపేట మండ‌లంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని పలాసపురం వద్ద పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు 50 మంది ప్రయాణికులతో బ‌స్ వెళ్తుంది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా భారీ శ‌బ్దంతో ఆర్టీసీ బస్‌ వెనుక చక్రాలు ఊడిపోయాయి. బ‌స్సులో ఉన్న వారికి ఏం జ‌రుగుతో అర్ధంకాక భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో ఒక్కసారిగా బస్‌ పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. బస్‌ డ్రైవర్‌ చాకచక్యంగా బస్‌ను ఆపడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కాగా ప్రయాణికులను మరో బస్‌లో గమ్యస్థానాలకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement