Tuesday, May 14, 2024

యాదాద్రి జిల్లాలో భట్టి యాత్ర … వర్షంలోను కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ – వీడియోతో

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ జనగాం జిల్లా లోని పెంబర్తి గ్రామం కాకతీయ కళాతోరణం వద్ద ముగియగా ఆదివారం యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజక వర్గంలో ప్రవేశించింది. జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారధ్యంలో నియోజక వర్గ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, బీర్ల ఐలయ్య, కుడుదుల నగేష్, జనగాం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ, భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కళాతోరణం నుంచి శ్రీనివాస్ పురం గ్రామం వైపు యాత్ర కొనసాగుతుంది. వర్షం కురుస్తున్న భట్టి విక్రమార్క అడుగులో అడుగేస్తూ కాంగ్రెస్ నేతలు వెంట నడుస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement