Friday, April 26, 2024

ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్..

హైదరాబాద్ బాలనగర్ ప్లై ఓవర్ పై ఓ బాక్ అదుపు తప్పి డివైడర్ ను ఢి కొట్టింది. ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కొణిదెనకు చెందిన అశోక్ (24) లారీ డ్రైవర్. హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడి ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు ఈ ఉదయం తిరుమలగిరి కార్యాలయానికి బైక్‌పై బయలుదేరాడు. బాలానగర్ ఫ్లై ఓవర్ పైనుంచి అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : అక్రమ మైనింగ్ పై అన్ని అధారాలు ఉన్నాయి: నక్కా

Advertisement

తాజా వార్తలు

Advertisement