Friday, April 26, 2024

మన ఊరు మన బడి పర్యవేక్షణకు స్టేట్‌ అబ్జర్వర్ల నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మన ఊరు-మన బడి పనుల అమలు పర్యవేక్షణకు 17 మంది స్టేట్‌ అబ్జర్వర్లను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నారు. జూన్‌12 నాటికల్లా పనులు త్వరతగతిన పూర్తి చేయడంలో భాగంగా స్టేట్‌ అబ్జర్వర్లను నియమించినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు మన ఊరు-మన బడి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement