Sunday, April 28, 2024

జీఎన్‌ఎం, మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ స్కూల్స్‌లో 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్‌ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష్రన్‌ సెప్టెంబర్‌ నుండి 16 వరకు అందుబాటు-లలో ఉంటుందని, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరింది.

డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో ఈనెల 19లోగా, ప్రైవేట్‌ స్కూళ్లలో అక్టోబర్‌ 10లోగా సమర్పించాలని పేర్కొంది. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్‌ 4 నాటికి పూర్తవుతుందని, 2023-2024 విద్యా సంవత్సరానికి తరగతులు అక్టోబర్‌ 15 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ అధికారిక వెబ్‌సైట్‌ని సంప్రదించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement