Sunday, May 19, 2024

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఏపీ మంత్రి విమర్శలు

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ లేదని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏది చెపితే… రేవంత్ రెడ్డి అదే ఫాలో అవుతారని ఎద్దేవా చేశారు. రేవంతర్ రెడ్డికి ఒక పార్టీ అంటూ లేదని విమర్శించారు. రేవంత్ ది కాంగ్రెస్ పార్టీ కాదని… తెలుగు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

అమరావతి గురించి రేవంత్ రెడ్డికి ఎందుకని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ… మరో పార్టీ అధినేత (చంద్రబాబు) అంటే ఇష్టమని రేవంత్ రెడ్డి చెప్తారని దుయ్యబట్టారు. రేవంత్ క్యారెక్టర్ ఇదని… విలువలతో కూడిన రాజకీయాలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని బాలినేని హితవు పలికారు.

ఈ వార్త కూడా చదవండి: ఏసీబీ కోర్టుకు పీసీసీ చీఫ్ రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement