Thursday, April 18, 2024

ఏసీబీ కోర్టుకు పీసీసీ చీఫ్ రేవంత్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ హాజరయ్యారు. కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. రేవంత్‌రెడ్డి పీఏ సైదయ్య, వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిల వాంగ్మూలాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం నమోదు చేసింది. నరేందర్‌రెడ్డి బంధువుతోపాటు మరొకరు విచారణకు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: పెట్రోల్‌పై రూ.3 తగ్గింపు!

Advertisement

తాజా వార్తలు

Advertisement