Thursday, May 2, 2024

కారు ఢీకొని వృద్ధురాలి మృతి.. వ‌రంగ‌ల్ జాతీయ రహదారిపై ఘటన

జనగామ (ప్రభన్యూస్ ప్రతినిధి) : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వస్తున్న ఫార్చునర్ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. వ‌రంగ‌ల్ హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై జ‌న‌గామ జిల్లా చాగ‌ల్లు వ‌ద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

చాగల్లు గ్రామానికి చెందిన చేపూరి నర్సమ్మ (75) జాతీయ రహదారి దాటుతుంండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఫార్చునర్ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రవణ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement