Saturday, April 27, 2024

నిర్మాత మ‌ధు మంతెనని ప‌రామ‌ర్శించిన.. అల్లు అర్జున్

నిర్మాత మ‌ధు మంతెన ఎక్కువ‌గా హిందీలో చిత్రాల‌ను నిర్మించారు. బాలీవుడ్ లో గజినీ, సూపర్ 30, ఉడ్తా పంజాబ్, ’83 తదితర ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు.. తెలుగు, బెంగాలీలో కూడా నిర్మాతగా వ్యవహరించారు. .కాగా అనారోగ్యం కారణంగా మధు మంతెన తండ్రి మురళి రాజు హైదరాబాద్ లో కన్నుమూశారు. కాగా మధు మంతెన నివాసానికి వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనను పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మధు మంతెనకు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement