Saturday, April 27, 2024

ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల‌పై ‘భార‌త్’ స‌మావేశం..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పాకిస్థాన్ ఎన్ ఎస్ ఏ..

తాలిబ‌న్లు ఈ పేరు చెబితే ప్ర‌పంచ‌దేశాల‌న్నీ వ‌ణికిపోతుంటాయి.అంత‌టి క్రూర‌త్వంగా..క‌ఠినంగా ఉంటారు వారంతా. కాగా ఆఫ్ఘనిస్థాన్ తాలిబ‌న్ల పాల‌న‌లోకి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నవంబరు 10, 11న భార‌త్ ఓ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఇందులో ప‌లు దేశాల ప్ర‌తినిధులు పాల్గొన‌నున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవల్ ప‌లు దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. పాకిస్థాన్ తో పాటు ఇరాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా, చైనా, తదితర దేశాలకు భార‌త్ ఆహ్వానం పంపింది. కాగా ఈ స‌మావేశానికి తాను హాజ‌రుకాన‌ని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మొయీద్ యూసఫ్ చెప్పారు. అంతేగాక‌, భార‌త్‌పై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

శాంతిని కాపాడే శక్తి వినాశ‌కారుల‌కు ఉండ‌బోద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్థాన్ లో ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో అందరికీ తెలుస‌ని, దానిపై చర్చించవలసిన అవసరం లేదని తెలిపారు. భారత ప్రభుత్వ తీరు, భావజాలం ఆఫ్ఘ‌న్‌లో శాంతి ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుందో తనకు తెలియదని వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ దేశాలు కళ్లు మూసుకున్నాయ‌ని, ఇండియా తీరుపై ఏ దేశ‌మూ స‌రైన విధంగా మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement