Sunday, May 12, 2024

జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి

సూర్యాపేట లో ఏర్పాటు చేసిన జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వందల మంది గాయపడ్డారు. మొత్తం మూడు గ్యాలరీలు ఏర్పాటు చేయగా ఒకవైపు గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రమాదఘటన పై వెంటనే స్పందించిన పోలీస్ లు..

కేంద్రంలో నిర్వహిస్తున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో అపశృతి.. ఆడియన్స్ కూర్చున్న గ్యాలరీ కూలి చాలా మందికి గాయాలు.. తక్షణమే స్పందించిన జిల్లా పోలీసులు శరవేగంగా సహాయక చర్యలు చెప్పట్టి క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హాస్పటిల్ కు తరలించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ లు ప్రమాద స్థలం వద్ద ఉండి సహాయక చర్యలు అందించారు. ఇనుప రాడ్లను తొలగించి క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు.పోలీసు వాహనాలను పెట్టి క్షతగాత్రులను వేగంగా ఆస్పటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement