Tuesday, April 30, 2024

కరోనా ఎఫెక్ట్.. కాణిపాకంలో కూడా బంతి భోజనం నిలిపివేత

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము అయిన కాణిపాకంలో నిత్య అన్నదాన సత్రము వద్ద బంతి భోజనం నిలిపి వేస్తున్నట్టు ఆలయం అధికారులు ప్రకటించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు రేపటి నుండి బంతి భోజనాలు నిలిపేసి ప్యాకెట్ల లను భక్తులకు పంపిణీ చేయుటకు ప్రత్యామ్నాయ చర్యలు చేస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీ ఎ. వెంకటేశు తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా అధికంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement