Tuesday, May 21, 2024

తెల్లవారితే గురువారం…ట్రైలర్ లో అది గమనించారా ?

కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా మనికాంత్ దర్శకత్వంలో వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెల్లవారితే గురువారం. మత్తు వదలరా సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించుకున్న శ్రీ సింహ మార్చి 27న తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. అయితే ఆదివారం రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కీరవాణి కొడుకులను చూస్తే చాలా గర్వంగా ఉందని చెప్పారు.మరోవైపు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అంతా కూడా పెళ్లి నుంచి తప్పించుకోడానికి హీరో చేసే ప్రయత్నం… ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో నేపథ్యంలో సాగినట్టు అర్థం అవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement