Sunday, April 28, 2024

ప్ర‌భాస్ కి అరుదైన గౌర‌వం-రామ్ లీలా మైదానంలో జ‌రిగే రావ‌ణాసుర ద‌హ‌న కార్య‌క్ర‌మానికి ఆహ్వానం

బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే హాలీవుడ్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ కి అరుదైన గౌరవం దక్కింది. ఇదే విషయాన్ని కృష్ణంరాజు గనుక బ్రతికి ఉండి ఉన్నప్పుడు తెలిసి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు అని అభిమానులు తెగ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.. ఆ అరుదైన గౌరవం ఏమిటి అంటే దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణాసుర దహన కార్యక్రమానికి నిర్వాహకులు ప్రభాస్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నారు. రావణ దహనం చేసేందుకు ఆది పురుష్ లో రాముడిగా కనిపించే యంగ్ రెబెల్ స్టార్ ను మించిన అతిథి మరొకరు ఉండరని వారు భావిస్తున్నారు. అయితే జీవితంలో పెద్దదిక్కు అయిన పెదనాన్నను కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్ ఈ కార్యక్రమానికి వెళ్తారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement