Friday, April 26, 2024

గండిచెరువులో వ్య‌క్తి గ‌ల్లంతు

యాదగిరిగుట్టలోని గండిచెరువులో స్నానం చేస్తూ ఓ భక్తుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి సికింద్రాబాద్ అల్వాల్‌కు చెందిన భువనేశ్వర్(19)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గండి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కొండక్రింద ఆలయ లక్ష్మీ పుష్కరిణిలో మరమ్మత్తు పనులు చేపట్టడంతో అధికారులు గత వారం రోజులుగా భక్తులకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో గండి చెరువులోనే భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement